ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో టాటా ఏసీ వాహనాన్ని  ఓ లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో  టాటా ఏసీలో ప్రయాణిస్తున్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక  చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన హనుమంతు ఆనందరావు(45), హనుమంతుశేఖర్(15), చింతాడి ఇందు(65)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెందుర్తి పోలీసులు చెప్పారు.

ALSO READ : ఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్ గూడ జైలు నుంచి పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు