
ఖైరతాబాద్, వెలుగు: లారీలకు సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు సి. అంజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గా ప్రసాద్ కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నాటకలో లీటర్ డీజిల్పై రూ .12 తగ్గించినట్లు చెప్పారు.
లారీ ఓనర్ల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలకే తాము మద్దతిస్తామని తెలిపారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసి, ఫిట్ నెస్ గ్రీన్ ట్యాక్స్ ను రద్దు చేయాలన్నారు. తెలంగాణలో ఉన్న బోర్డర్ చెక్పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, ప్రతి జిల్లాలో హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వెల్లడించారు.
ట్రక్ పార్కింగ్ కోసం స్థలాలను కేటాయించాలని పేర్కొన్నారు. సమావేశంలో లీగల్సెల్అడ్వైజర్ ఎమ్.మదన్మోహన్, క్రమశిక్షణ విభాగం చైర్మన్ కె.నాగేశ్వరరావు, సయిద్ఫాయాజ్అలీ, ఉపాధ్యక్షులు పి.జగన్నాథ్రెడ్డి, సమ్మిరెడ్డి, సలావుద్దీన్, రవి, జనార్దన్ పాల్గొన్నారు.