వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో గ్రామంలో ప్రేమ వివాహం ఉద్రిక్తలకు దారితీసింది.తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్న కావ్య-, రంజిత్ తాము క్షేమంగానే ఉన్నామని సెల్పీ వీడియో తీసి కుంటుంబ సభ్యులకు పంపారు ప్రేమికులు.
దీంతో ఆగ్రహానికి గురైన అమ్మాయి తరపు వాళ్లు రాత్రి సమయంలో అబ్బాయి ఇంటితో పాటు, వారికి సహకరించిన మరో ఇద్దరి ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పాక్షికంగా ఇండ్లు కాలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇటుకాలపల్లిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.