ప్రేమించిన యువతికి మరోవ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిందనే కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా పర్చాడు. దీంతో యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ కు చెందిన శిరీష అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్ అనే యువకుడు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బస్వారాజు ఓ ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరువైపుల కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో 3 నెలల క్రితం అమ్మాయి తల్లిదండ్రులు శిరీషకు ఇటీవల మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిపించారు. ఆ తర్వాత ఆయువతిని హైదరాబాద్ ఎల్బీనగర్ హస్తినాపురంలో ఉంటున్న ఆమె బాబాయి ఇంట్లో ఉంచారు. విషయం తెలుసుకున్న బస్వరాజు.. ఇవాళ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఆమెపై విచక్షణ రహితంగా కత్తితో 18 చోట్ల పొడిచాడు. విషయాన్ని గమనించిన శీరిష కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
దాడి చేసిన నిందితుడుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.