
తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే చంపిన విషాద ఘటన కోయంబత్తురూలో చోటుచేసుకుంది. మొదట పెళ్లికి ఒప్పుకున్న యువతి.. ఆ తర్వాత వాయిదా వేస్తూ వస్తోందని.. ప్రేమించిన వాడే ఆమెను కడతేర్చాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి పెళ్లి వాయిదా వేయడంతో.. ఆమె వేరోవరినో ప్రేమిస్తుందనే అనుమానం ఆ యువకుడికి వచ్చింది. అదే ఈ దారుణానికి కారణం అయింది.
కోయంబత్తూరుకు చెందిన నందిని అనే యువతి కోయంబత్తూరులోని ఆర్ట్స్ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. ఆ కాలేజీ పక్కనే దినేష్ అనే యువకుడు ప్యాన్సీ షాపు నడుపుతున్నాడు. నందిని చూసి మనసుపడ్డ దినేష్.. ఆమెను ప్రేమిస్తున్నానని వేదించేవాడు. కొంతకాలం తర్వాత నందిని తల్లిదండ్రుల్ని కలిసి పెళ్లికి ఒప్పించాడు. అయితే దినేష్ అంటే ఇష్టంలేని నందిని ఎప్పటికప్పుడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది. నందిని పెళ్లి వాయిదా వేయడానికి కారణం.. ఆమె మరెవరినో ప్రేమిస్తుందనే అనుమానం దినేష్కు వచ్చింది. దాంతో ఆమెపై కక్ష పెంచుకున్న దినేష్.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి బలవంతంగా ఆమె నోట్లో విషం పోశాడు. ఆ విషాన్ని నందిని బయటకు కక్కకుండా ఆమె నోటి చుట్టూ చున్నీ కట్టాడు. దాంతో నందిని కాసేపటి తర్వాత చనిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు నందిని అపస్మారక స్థితిలో కనిపించింది. దాంతో వెంటనే నందినిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నందిని మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
నందిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దినేష్పై కేసు నమోదు చేశారు. దాంతో దినేష్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం దినేష్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.
For More News..