ఇంటర్ చదివే వారు ప్రాణాలు తీసుకున్నారు... ఎందుకంటే ...

ఇంటర్ చదివే వారు ప్రాణాలు తీసుకున్నారు... ఎందుకంటే ...

ఇంకా వారిద్దరు మైనర్లు.. లోకం గురించి పూర్తిగా తెలియదు... కాని ప్రేమ గురించి అవపూసన పట్టారు.  తెలిసి తెలియని వయస్సులో లవ్ స్టోరీ ప్రారంభించారు.   తాము పెళ్లి చేసుకుంటామని ఇంట్లో పెద్దలకు చెప్పారు.  వారు నో అన్నారనుకుంట మరి.. ఈ విషయం స్పష్టంగా తెలియదు కాని ఆగస్టు 18న ఇంటి నుండి పరారయ్యారు.   ఇక అంతే ..రెండు రోజులకు అనగా ఆగస్టు 20న విగతజీవులుగా దర్శనమిచ్చారు.   నిండు నూరేళ్లపాటు జీవించాల్సిన వాళ్లు సగం జీవితం గడపకుండానే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ముందుగా ప్రేమించినప్పుడు లేని భయం.. పెద్దలకు చెప్పి ఒప్పించడానికి ఎందుకు వస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రేమజంటల ఆత్మహత్యలు రోజుకు ఒక్కసారి ఎక్కడోచోట వినాల్సి ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా భాకరాపేటలో విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రామ సముద్రం మండలం చిట్టెంవారిపల్లెకు చెందిన బోడె కళ్యాణి (15).. చౌడేపల్లి మండలం లద్దకానికి చెందిన యుగంధర్  (17)గా గుర్తించారు. వీరిద్దరూ బుగ్గనూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. అయితే వీరు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆదివారం ( ఆగస్టు 20) పశువులను కాసేందుకు కాపరులు అడవిలోకి వెళ్లగా అక్కడ ప్రేమజంట చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.