ఉత్తరప్రదేశ్లో క్రిమినల్స్ కోసం వేట కొనసాగుతోంది. మూడు వారాల క్రితం గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే మట్టుబెట్టిన పోలీసులు.. ఇవాళ(శనివారం) ఉదయం మరో వాంటెడ్ క్రమినల్ టింకూ కపాలా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న లక్నోకు చెందిన టింకూ కపాలా బారాబంకీ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే శనివారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల అక్కడి వెళ్లారు. అతడు వారిపై కాల్పులు జరపడంతో..అలర్టైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో టింకూ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి అప్పటికే అతడు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. టింకూపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్టు ఎస్పీ అరవింద్ చతుర్వేది తెలిపారు.