లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ అరెస్ట్

లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ అరెస్ట్
  • రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఆర్మీ‌ జవాన్ కుమారుడే సత్యేంద్ర
  • 2003 నుంచి కార్ల‌ దొంగగా మారిన సత్యేంద్రసింగ్ షెకావత్ 

బెంగళూరు: లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాజస్థాన్ జైపూర్ కు చెందిన  సత్యేంద్ర ఆర్మీ జవాన్ కుమారుడిగా గుర్తించారు. 2003 నుంచి కార్ల దొంగగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు నిందితుడిపై పలు రాష్ట్రాల్లో 61 కేసులు ఉన్నాయి. గతేడాది జనవరిలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ స్టార్ హోటల్ లో  లగ్జరీ కారు దొంగతనం చేశాడు.

అదే సమయంలో పోలీసులకు తన ఫొటో పంపి.. చేతనైతే తనను పట్టుకోండంటూ సవాల్ విసిరాడు. గత ఫిబ్రవరిలో బెంగళూరు పోలీసులు సత్యేంద్ర సింగ్ షెకావత్ ను అరెస్ట్ చేశారు. పాత కేసుల్లో విచారించేందుకు బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకొచ్చారు. అయితే సత్యేంద్రజైన్ ను విచారించగా.. లగ్జరీకార్ల దొంగతనం బయటపడింది. కార్ల రికవరీ కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

టీచర్ నిర్వాకం..స్కూల్కు 20 లక్షల బిల్లు

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్టూడెంట్ ఆన్సర్