జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్నియోజకవర్గం చింతల్ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో సోమవారం ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరించింది. గాయపడిన వారిలో సురేశ్ అనే బాలుడితోపాటు జనార్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, మరో ఇద్దరు ఉన్నారు. వీరిని స్థానికులు సమీప హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలతో ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కలను తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
