
కూకట్పల్లి, వెలుగు: మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు వివేకానందనగర్కాలనీలోని ఓ ఇంట్లో అమ్మకానికి దాచిన రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. పాముని విక్రయించడానికి వచ్చిన చిత్తూరు చంద్రశేఖర్, తమిళనాడు భాస్కర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాదాల రవికుమార్ పరారీలో ఉన్నాడు. నిందితులను, పామును కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు.