సుధీర్రెడ్డి ఓట్లేసిన జనాన్ని గాలికొదిలేశారు: మధు యాష్కీగౌడ్

సుధీర్రెడ్డి ఓట్లేసిన జనాన్ని గాలికొదిలేశారు: మధు యాష్కీగౌడ్
  • ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్

తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్లిన పిరాయింపు ఎమ్మెల్యే ప్రజాధనాన్ని స్వంత అత్తమామలకు సీఎం రిలీఫ్ పండు ద్వారా దోచిపెట్టిన వ్యక్తి.. తనపై అనుచిత వాఖ్యలు చేయడం చేయడం ప్రజలకు ఆయన తీరు అర్థం అవుతోందని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకర్గంలోని మన్సూరాబాద్,వనస్థలిపురం డివిజన్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిన జనం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.ఢిల్లీ లీడర్ కావాలా గల్లీ లీడర్ కావాలా అంటున్న సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో ఒట్లేసిన జనాన్ని వదిలి గచ్చిబౌలి వెళ్లారని నేను నా పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలని ఎల్బీనగర్ కు వచ్చానని చెప్పారు.తనను విమర్శించే స్తాయి సుధీర్ రెడ్డికి లేదని అన్నారు.ఎల్బీనగర్ కాంగ్రెస్ గెలుపుతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.ఈసందర్భంగా డివిజన్ లోని పలు పార్టీలకు చెందిన 50 మంది మధుయాష్కీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.