తెలంగాణలో తాలిబాన్ల పాలన

తెలంగాణలో తాలిబాన్ల పాలన

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని సీఎం చెప్పడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. గతంలో సన్నాలు వేయాలంటూ రైతుల్ని మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాలసీ చెప్పకుండా.. రైతుల్ని వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇక ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్ట్ లు చూస్తుంటే.. తెలంగాణలో తాలిబాన్ల పాలనలా ఉందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్.