హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ప్రభుత్వం నామినేట్ చేసింది. గురువారం రాష్ట్ర కేబినెట్ ఈ ప్రపోజల్ పంపగా, శుక్రవారం గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర్వులు శనివారం వెలువడుతాయని పేర్కొన్నాయి. మొదట గవర్నర్ కోటాలో హుజూరాబాద్కు చెందిన పాడి కౌశిక్ రెడ్డిని నామినేట్ చేస్తూ ఆగస్టులో కేబినెట్ తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపగా.. కౌశిక్పై పలు కేసులు పెండింగ్లో ఉండడంతో తమిళిసై పెండింగ్లో పెట్టారు. దీంతో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్యే కోటాకు మార్చిన రాష్ట్ర సర్కార్.. ఈ నెల 16న ఆయనతో నామినేషన్ వేయించింది. ఆయన స్థానంలో మధుసూదనాచారిని ఖరారు చేసి, సర్క్యులేషన్ పద్ధతిలో గవర్నర్ కు ప్రపోజల్ పంపింది. కాగా, రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన మధుసూదనాచారి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సీఎం కేసీఆర్... మండలి చైర్మన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పదవికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
మధుసూదనాచారికి మండలి చైర్మన్ పదవి?
- తెలంగాణం
- November 20, 2021
లేటెస్ట్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
- చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- CSK vs RCB : చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే
- Good Health: పొన్నగంటి... పోషకాల గని
- Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం