
మీరట్లో ఈనెల 18న ఎన్కౌంటర్
మీరట్: మాఫియా డాన్ శివశక్తి నాయుడు ఖతం అయ్యిండు. ఢిల్లీ–డెహ్రడూన్ హైవేలో చోరీ అయిన ఎస్యూవీ వెహికల్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు. ఈ నెల 18న చోరీ అయిన వెహికల్ మీరట్లోని ఓ అపార్ట్మెంట్ దగ్గర పార్క్ చేసి ఉందని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం లోపలికి వెళ్తుండగా పోలీసులపై కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపి అతన్ని ముట్టుబెట్టారు. చనిపోయిన వ్యక్తి డాన్ శివశక్తి నాయుడని తర్వాత గుర్తించారు. ఎన్కౌంటర్లో ఓ పోలీస్ కూడా గాయపడ్డాడు. శివశక్తి ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి ఓ కార్వాన్, డబుల్ బారెల్ గన్, పలు రౌండ్ల బులెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కేసులో ఇటీవలే పెరోల్పై విడుదలైన నాయుడు.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతుండు.
నెల్లూరుకు చెందిన శివశక్తి నాయుడు..
నార్త్ స్టేట్లలో డాన్గా ఎదిగిన శివశక్తి నాయుడు తెలుగోడే. నెల్లూరు జిల్లాకు చెందిన వీరి కుటుంబం బతుకు దెరువు కోసం ఏళ్ల క్రితమే ఢిల్లీకి మారింది. వీళ్లు అక్కడ బట్టల షాప్ పెట్టుకున్నారు. మొదట్లో తండ్రికి సాయంగా ఉండేవాడు. తర్వాత మర్డర్లు, దోపీడీలు, కిడ్నాప్లు చేయటం ప్రారంభించాడు. ఢిల్లీలోనే నంబర్ వన్ డాన్గా మారాడు. హవాలా వ్యాపారం చేస్తూనే బడా వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజేవాడు. ఓ వ్యాపారి వద్ద 8 కోట్లు దోచుకున్న సంఘటన సంచలనం రేపింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను బెదిరించి రూ.కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
జైల్లో ఉండగానే నెట్ వర్క్ విస్తరణ
లూథియానాలో ఓ బిజినెస్ మ్యాన్ నుంచి రూ.6 కోట్లు వసూలు చేసిన ఘటనలో శివశక్తి నాయుడు 2014 నుంచి తీహార్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటూనే అనుచరులతో దందాలకు పాల్పడ్డాడు. అతని అనుచరులు మర్డర్లు, కిడ్నాపులు, వసూళ్లకు పాల్పడ్డారు. పోలీస్ అధికారినే చంపేందుకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శివశక్తి అచూకీ చెప్పిన వారికి రూ. లక్ష ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు.
For More News..