శ్రీశైలంలో మహా కుంభాభిషేకం ప్రారంభం

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం ప్రారంభం

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంలో శుక్రవారం మహాకుంభాభిషేకం ప్రారంభించారు. ఈ నెల 21 వరకు ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కుంభాభిషేకాన్ని ప్రారంభించారు.

మొదటి రోజు ప్రారంభ పూజలకు శ్రీశైలం జగద్గురు 1008 చిన్న సిద్ధ రామ శివాచార్య మహా స్వామిజీ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.