
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్సూచించారు. బుధవారం మరిపెడ మండలంలోని తండా ధర్మారం, పెద్ద వంగర మండలం పోచంపల్లి, గంట్లకుంట, చిట్యాల, తొర్రూరు మండలం మాటేడులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ లక్ష్యానికి చేరువలో ఉన్నామని, రైతులు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ధాన్యం సేకరణ పూర్తయిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, డబ్బులు త్వరగా వారి బ్యాంక్అకౌంట్లలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డీసీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు తదితరులున్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది
నర్సంపేట/ పర్వతగిరి, వెలుగు: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ సత్యశారద సూచించారు. బుధవారం ఖానాపురం మండలంలోని పెద్దమ్మ గడ్డ, మనుబోతుల గడ్డ, ఖానాపురం, పర్వతగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమెను పరిశీలించారు. రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. డీఆర్డీవో కౌసల్యదేవి, జిల్లా సహకార అధికారి నీరజ, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, ఆర్డీవోలు ఉమారాణి, సత్యపాల్ రెడ్డి పాల్గొన్నారు.
4 లోగా కొనుగోళ్లు పూర్తవ్వాలి
జనగామ, వెలుగు: వరి ధాన్యం కొనుగోళ్లను వచ్చే నెల 4 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ పింకేశ్ కుమార్ తో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 32,066 మంది రైతుల అకౌంట్లలో రూ.335 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను స్పీడప్ చేయాలని, వచ్చే నెల 3 నుంచి 20 వరకు ప్రతీ గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించాలని, సీజనల్వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.