
వికారాబాద్, వెలుగు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో శనివారం వికారాబాద్ జిల్లా మాల మహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలలకు సముచిత స్థానం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు.