10 వేలకు పదో తరగతి విద్యార్థినిని అమ్మేశారు.. అక్రమ రవాణా చేసిన మహారాష్ట్ర దంపతులు

10 వేలకు పదో తరగతి విద్యార్థినిని అమ్మేశారు.. అక్రమ రవాణా చేసిన మహారాష్ట్ర దంపతులు
  • మైనర్​పై రాజస్థాన్​ యువకుడి లైంగికదాడి
  • నిందితులను అరెస్ట్​ చేసి వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్​ డీఎస్పీ

ఆదిలాబాద్, వెలుగు: రూ.10 వేలకు పదో తరగతి చదువుతున్న బాలికను అమ్మేసిన ఘటన ఆదిలాబాద్  జిల్లాలో వెలుగులోకి వచ్చింది. శనివారం డీఏస్పీ జీవన్ రెడ్డి తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న భీంపూర్ మండలానికి చెందిన బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నెల 22న బాలిక మామ భీంపూర్  పోలీస్​స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కిడ్నాప్  కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను మహారాష్ట్రకు చెందిన దంపతులు నిర్మల బాపుణ్య ఆత్రం, బాపుణ్య రాజారాం ఆత్రం మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారు.

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి బస్సులో నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడి నుంచి రైలులో రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కోట గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ కరణ్  అలియాస్  భగవత్  అనే యువకుడికి రూ.10 వేలకు అమ్మేశారు. కరణ్  బాలికపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు తమ కోసం గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు బాలికను ఆదిలాబాద్ కు తీసుకొచ్చి వదిలేశారు. ఈ నెల 25న బాలిక ఇంటికి చేరుకోగా, నిందితులు శనివారం రైల్వే స్టేషన్ లో పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. దంపతులను అరెస్ట్​ చేయగా, కరణ్ పై రేప్, పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. జైనథ్  సీఐ సాయినాథ్, బీంపూర్  ఎస్సై పీర్ సింగ్  ఉన్నారు.