మహారాష్ట్ర జైళ్ల నుంచి సగం మంది విడుదల?

మహారాష్ట్ర జైళ్ల నుంచి సగం మంది విడుదల?

ముంబై: కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నందున జైలులో ఉన్న 50 శాతం ఖైదీలను టెంపరరీగా విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై పవర్​ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సీరియస్​ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మాత్రం టెంపరరీ బెయిల్ ​లేదా పెరోల్ ​ఇవ్వకూడదని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు మార్చిలో చెప్పింది. దీంతో బోంబే హైకోర్టు జస్టిస్​ఏఏ సయ్యద్, స్టేట్ ​హోం డిపార్ట్‌‌మెంట్​అడిషనల్​ చీఫ్​ సెక్రెటరీ సంజయ్ ​చహాండె, మహారాష్ట్ర డైరెక్టర్​ జనరల్​ ఆఫ్ ​ప్రిజన్స్​ఎస్ఎన్​ పాండేలతో హై పవర్​ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో 35,239 మంది రిలీజ్​ అవుతారని కమిటీ ఎక్స్‌‌పెక్ట్ ​చేసింది. సెంట్రల్​ముంబైలోని ఆర్థర్​ రోడ్డు జైలులో సుమారు 100 మంది ఖైదీలు, సిబ్బందికి, బైకుల్లా మహిళల జైలులో 54 ఏండ్ల ఖైదీకి కరోనా పాజిటివ్​వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖైదీలను ఎప్పుడు విడుదల చేయాలనే నిర్దిష్ట సమయాన్ని కమిటీ చెప్పలేదు. సీరియస్​కేసులలో, ఇండియన్​పీనల్​కోడ్​(ఐపీసీ), మహారాష్ట్ర కంట్రోల్​ ఆఫ్​ ఆర్గనైజ్డ్​ క్రైమ్స్​ యాక్ట్​, మహారాష్ట్ర ప్రొటెక్షన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్ ​ఆఫ్ ​డిపాజిటర్స్ యాక్ట్, అన్ లాఫుల్​ యాక్టివిటీస్ ​ప్రివెన్షన్​యాక్ట్, ప్రివెన్షన్ఆఫ్​మనీ లాండరింగ్​ యాక్ట్​ వంటి స్పెషల్​ యాక్ట్స్​కింద అరెస్టు అయిన ఖైదీలను విడుదల చేయరు. స్పెషల్​యాక్ట్స్​కింద అరెస్ట్​ అయిన ఖైదీలను కూడా విడుదల చేయాలని అడ్వకేట్​ ఎస్‌‌బీ తాలేకర్​ ఇచ్చిన రిప్రెజెంటేషన్‌‌ను కమిటీ రిజెక్ట్​చేసింది. నేర తీవ్రత, నేర స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఏ తరగతి ఖైదీలను విడుదల చేయాలని కమిటీ నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

7 రోజులు..31 దేశాలు..149 ఫ్లైట్లు