
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహరాష్ట్ర, చత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమై కవాండే, నెల్లుండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
మావోయిస్టుల దళాలకు... సి60 సీఆర్ పీఎఫ్ పోలీసుల మద్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసు బలగాలు సర్చ్ అపరేషన్ చేపట్టారు. నలుగురు మావోల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మహారాష్ట్ర.. ఛత్తీస్ ఘడ్ అటవీప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
ALSO READ | కర్ణాటక హనగల్ గ్యాంగ్రేప్ కేసు..బెయిల్ తర్వాత నిందితుల ఊరేగింపు..మండిపడుతున్న జనం