రేవంత్ సీఎం అని మర్చిపోయి మాట్లాతుండు

రేవంత్ సీఎం అని మర్చిపోయి మాట్లాతుండు
  • మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

షాద్ నగర్, వెలుగు : ఆడబిడ్డనైన తనను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు మాటల దాడిచేస్తున్నారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ చెప్పారు. శనివారం ఆమె షాద్​నగర్ పరిధిలోని జిల్లేడు చౌదరిగూడెం మండలం పెద్దఎల్కిచర్ల, పద్మారం, చౌదరిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి చిక్కడు.. దొరకడు అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా, సీఎం స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని, మరోసారి జనం కాంగ్రెస్​ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మోదీ అంటే గ్యారంటీ అని, బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని చెప్పారు. అనంతరం నిర్వహించిన మహబూబ్​నగర్​పార్లమెంట్​గిరిజన సమావేశంలో డీకే అరుణ పాల్గొని మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఫొటోను సీఎం రేవంత్​రెడ్డికి ఇస్తే.. పక్కకు పడేసి అవమానించారని చెప్పారు.

ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మోదీ పాలనే దేశానికి శ్రీరామ రక్ష అని, మరోసారి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, గిరిజన నాయకులు పాల్గొన్నారు.