కేసీఆర్​కు గిఫ్ట్ ఇద్దాం: మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

కేసీఆర్​కు గిఫ్ట్ ఇద్దాం: మహేశ్వరం ఎమ్మెల్యే  సబితారెడ్డి

చేవెళ్ల, వెలుగు :  చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్లలో శనివారం ప్రజాఆశీర్వాద సభలో  ఆమె పాల్గొని మాట్లాడారు.  చేవెళ్లలో సెంటిమెంట్ ఉందని, ఇదే స్ఫూర్తితో కచ్చితంగా ఈ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని పేర్కొన్నారు  గ్రేటర్​కు దీటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. 

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును చేవెళ్ల నుంచి పార్లమెంట్ కు పంపుదామన్నారు.  కార్యక్రమంలో  చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్యే ప్రకాష్​గౌడ్​, అరికేపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి,శంభీపూర్​ రాజు, పొన్నాల లక్ష్మయ్య, యెగ్గే మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్​, మహేశ్వర్​రెడ్డి,  పార్టీ నేతలు కర్నె ప్రభాకర్​, బాలమల్లు సభలో పాల్గొని మాట్లాడారు.