అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసేస్తాం : కాంగ్రెస్

అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసేస్తాం : కాంగ్రెస్

రాహుల్ సమక్షంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత దేవ్ ప్రకటన

మైనారిటీ డిపార్టుమెంట్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కామెంట్స్

ఢిల్లీ : 2019లో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని తొలగిస్తామని చెప్పారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత దేవ్. ఢిల్లీలో ఏఐసీసీ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో… పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ కామెంట్స్ చేశారు సుష్మిత దేవ్. ఇది మైనారిటీలకు తాను ఇస్తున్న హామీ అని ఆమె చెప్పారు.