మహీంద్రా బండ్లకు.. శామ్సంగ్ డిజిటల్ కీ

మహీంద్రా బండ్లకు.. శామ్సంగ్ డిజిటల్ కీ

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ​కంపెనీ మహీంద్రా అండ్​ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీల కోసం డిజిటల్ కీలను అభివృద్ధి చేయడానికి శామ్​సంగ్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫీచర్ శామ్​సంగ్​ వాలెట్​కు లింకై ఉంటుంది. దీనివల్ల ఇకపై వాహనాలను అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాక్ చేయడానికి  తాళంచెవి అవసరం లేదు.  మహీంద్రా ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన మొదటి భారతీయ వాహన సంస్థ. ఈ సదుపాయం గెలాక్సీ జెడ్​, ఎస్​ సిరీస్ డివైజ్​లలో శామ్​సంగ్ వాలెట్ వాడేవారికి లభిస్తుంది. 

తర్వాత ఏ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా అందుబాటులోకి రానుంది.  కొత్త మహీంద్రా ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీలు నవంబర్ నుంచి ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అమ్మకానికి వస్తాయి. ప్రస్తుతం ఉన్న కారు యజమానులు సర్వీస్ సెంటర్​లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్​ను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్​ చేయించుకోవాలి.  ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయినా కూడా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్​ఎఫ్​సీ) సొల్యూషన్ సహాయంతో డిజిటల్ కీ పనిచేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కారును లాక్ అన్​లాక్ చేయవచ్చు.