శామీర్పేట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి మల్లారెడ్డి భరతం పడతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. మంత్రి భూ దందాలు, మెడికల్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతామన్నారు.
శుక్రవారం శామీర్పేటలో జరిగిన కాంగ్రెస్ ఆత్మీయ భరోసా కార్యక్రమానికి మైనంపల్లి హాజరై మాట్లాడారు. మేడ్చల్లో చెరువులు, కుంటలని చూడకుండా మల్లారెడ్డి వెయ్యి ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీలపై దర్యాప్తు చేపడతామన్నారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.