గతంలో జరిగిన ఘోర విమాన ప్రమాదాలు ఇవే..

గతంలో జరిగిన ఘోర విమాన ప్రమాదాలు ఇవే..

2025 జూన్ 12: గుజరాత్‌‌‌‌లోని అహ్మదాబాద్‌‌‌‌లో టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫ్లైట్ 171 కుప్పకూలి మొత్తం 242 మంది మృతి. 

1978 జనవరి 1: మహారాష్ట్రలోని బాంబే బాంద్రా తీరంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫ్లైట్ 855లో టెక్నికల్ సమస్య వల్ల అరేబియా సముద్రంలో కుప్పకూలి 213 మంది మృతి

2010 మే 22: కర్నాటకలోని మంగళూరులో రన్ వేపై ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ 812 అదుపుతప్పి లోయలో పడి 158 మంది మృతి

1988 అక్టోబర్ 19: గుజరాత్‌‌‌‌లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో పైలట్ తప్పిదం వల్ల ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 113 కూలిపోయి 133 మంది మృతి

1976 అక్టోబర్ 12: మహారాష్ట్రలోని బాంబే దగ్గర ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 171లో ఇంజిన్ ఫెయిలై మంటలు రేగిన ప్రమాదంలో 95 మంది మృతి

1990 ఫిబ్రవరి 14: కర్నాటకలోని బెంగుళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర పైలట్ తప్పిదం వల్ల ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 605 కులిపోయి 92 మంది మృతి

1991 ఆగస్ట్ 16: మణిపూర్‌‌‌‌‌‌‌‌లోని ఇంఫాల్‌‌‌‌లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 257 పైలట్ తప్పిదం వల్ల కూలిపోయి 69 మంది మృతి

2000 జులై 17: బిహార్‌‌‌‌‌‌‌‌లోని పట్నా దగ్గర ప్రైవేట్ ఆపరేటర్ అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 అదుపు తప్పి నివాసప్రాంతంలో కూలిపోవడంతో 55 మంది పాసెంజర్స్, 5 మంది జనం మృతి 

1993 ఏప్రిల్ 26: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రన్ వేపై ట్రక్కును ఢీకొట్టి ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 491 క్రాష్ అయి 55 మంది మృతి. పైలట్ తప్పిడం, ఏవియేషన్ అధికారుల తప్పిదం కారణం.

1973 మే 31: ఢిల్లీ పాలం ఎయిర్ పోర్ట్ దగ్గర పైలట్ తప్పిదం వల్ల ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 440 కూలిపోయి 48 మంది మృతి

2020 ఆగస్టు 7: కేరళలోని కాలికట్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో దుబాయ్‌‌‌‌ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ విమానం 1344 ల్యాండ్‌‌‌‌ అవుతుండగా రన్‌‌‌‌వే పై నుంచి పక్కకు జారి పడిపోయిన ఘటనలో 21 మంది మృతి. ఈ ప్రమాదంలో విమానం రెండుగా ముక్కలైంది. 

1996 నవంబర్‌‌‌‌‌‌‌‌ 12: హర్యానాలోని చర్ఖి దాద్రిలో జరిగిన విమాన ప్రమాదంలో ఫ్లైట్‌‌‌‌లో ఉన్న 349 మంది చనిపోయారు. దేశంలోనే అత్యంత దారుణమైన విమాన దుర్ఘటనగా ఇది మిగిలిపోయింది. సౌదీ అరేబియా ఎయిర్​లైన్స్​, కజకిస్తాన్​ ఏయిర్​లైన్స్​ విమానాలు గాల్లో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

1982 జూన్‌‌‌‌ 21: మహారాష్ట్రలోని బాంబే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఎయిరిండియాకు చెందిన విమానం 403 కూలిపోవడంతో 17 మంది మృతి

1978 జనవరి 1: ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ నుంచి ఎయిరిండియా విమానం 855లో టేకాఫ్‌‌‌‌ అయిన కొద్దిసేపటి తర్వాత అరేబియా సముద్రంలో కూలిపోవడంతో ఫ్లైట్లో ఉన్న 216 మంది మరణించారు.