- స్టేట్ బ్యాంకు రిపోర్టు
ముంబై: దేశంలో ఇన్సూరెన్స్ మరింత పెరగాలంటే ఉపాధి హామీ పథకం వర్కర్లకు ఇన్సూరెన్స్ను కంపల్సరీ చేయాలని స్టేట్ బ్యాంకు ఒక రిపోర్టులో వెల్లడించింది. ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని 18 శాతం నుంచి తగ్గించాలని కూడా సూచించింది. ఇందువల్ల దేశంలోని మరింత ప్రజలు ఇన్సూరెన్స్ సదుపాయం పొందడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. ఉపాధి హామీ వర్కర్లకు రూ. 342 ఖర్చుతోనే ఇన్సూరెన్స్ కల్పించొచ్చని చెబుతూ, ఇందుకయ్యే రూ. 400–500 కోట్లను ప్రభుత్వమే భరించొచ్చని సూచించింది. వంద రోజుల పని పూర్తి చేసే హౌస్ హోల్డ్స్ సంఖ్య 10 శాతానికి మించదని, కాబట్టి ఈ ఖర్చును ప్రభుత్వమే పెట్టొచ్చని పేర్కొంది. 2015 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ వ్యాప్తి మళ్లీ పెరిగిందని, ఇది 2021 నాటికి 4.2 శాతమని వెల్లడించింది.