గీతాంజలి 2.. ఈసారి పాన్​ ఇండియా రేంజ్​లో

గీతాంజలి 2.. ఈసారి పాన్​ ఇండియా రేంజ్​లో

సౌత్‌‌లో స్టార్ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజలి .. పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, ఫిమేల్ లీడ్‌‌గానూ ఇంప్రెస్ చేస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం ‘గీతాంజలి’గా ఆకట్టుకున్న అంజలి.. ఇప్పుడు దానికి సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టైటిల్‌‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కథ, స్ర్కీన్‌‌ప్లే అందిస్తూ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.  శివ తుర్లపాటి దర్శకుడు.  

ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌‌న్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ‘గీతాంజలి’ చిత్రం తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేయగా, సీక్వెల్‌‌ను  పాన్ ఇండియా రేంజ్‌‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది ప్రారంభంలో  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.  

అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది. శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భాను భోగ‌‌వ‌‌ర‌‌పు, నందు శ‌‌వ‌‌రిగ‌‌ణ‌‌ మాటలు రాస్తున్నారు.  ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.