ఫిబ్రవరి 15న భ్రమయుగం విడుదల

ఫిబ్రవరి 15న భ్రమయుగం విడుదల

మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'భ్రమయుగం’. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకుడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. హారర్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌గా రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను శనివారం ప్రకటించారు.

ఫిబ్రవరి 15న సినిమాను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌‌‌‌, భరతన్, అమల్దా లిజ్‌‌‌‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.