నవంబర్ 19న మాలల అలయ్ బలయ్

నవంబర్ 19న మాలల అలయ్ బలయ్

ఖైరతాబాద్ , వెలుగు:  మాలలు ఒకతాటిపైకి వచ్చే విధంగా.. వారిని చైతన్య  పరిచేందుకు బస్తీ బాట నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రాష్ట్ర  మాలల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  

మాలల సమస్యలు తెలుసు కునేందుకు ఈ నెల 29న ఆదివారం గ్రేటర్​ పరిధిలో బస్తీ బాట ప్రారంభిస్తున్నామని,  వచ్చే నెల 19న సిటీలో అలయ్..బలయ్​కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.