క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్, శ్రీకాంత్  

క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్, శ్రీకాంత్  

మలేసియా మాస్టర్స్‌లో భారత ఏస్‌ షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లు క్వార్టర్‌ఫైనల్‌లో దూసుకెళ్లారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మరియు ఆరో సీడ్ సింధు మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన అయా ఒహోరిని 21-16, 21-11 తేడాతో వరుస గేమ్‌లలో చిత్తు చేసింది. కేవలం 40 నిమిషాలలో ఈ గేమ్ ముగిసింది. క్వార్టర్స్‌లో సింధు  చైనాకు చెందిన యీ మాన్ జాంగ్‌తో తలపడనుంది.

మరో గేమ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ చైనాకు చెందిన షి ఫెంగ్ లీపై పోరాడి గెలిచాడు. గంట 10 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ 13-21 తేడాతో తొలి సెట్‌ను కోల్పోయాడు. అనంతరం 21-16, 21-11 తేడాతో వరుస సెట్లు గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ కు అర్హత సాధించాడు. ప్రణయ్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోతో తలపడనున్నాడు. మరో హోరాహోరీ మ్యాచులో కిదాంబి శ్రీకాంత్‌ 21-19, 21-19 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ విటిద్‌సర్న్‌పై విజయం సాధించాడు. శ్రీకాంత్ క్వాలిఫైయర్ పోరులో ఇండోనేషియాకు చెందిన క్రిస్టియన్ అదినాటాతో తలపడనున్నాడు.