- ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే నిర్ణయం తీసుకున్నట్లు వీడియో రిలీజ్
- ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు, తన కార్యకర్తల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అందులో ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే తెలియజేస్తానని స్పష్టంచేశారు. అందరి సహకారాన్ని తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోనని మైనంపల్లి పేర్కొన్నారు. మల్కాజ్గిరి ప్రజలకు, రాష్ట్రంలోని తన శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటానని చెప్పారు.
‘‘నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను. దేనికీ లొంగే ప్రసక్తి లేదు” అని స్పష్టం చేశారు. కాగా, కొన్నిరోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై మైనంపల్లి హన్మంతరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మల్కాజ్గిరి టికెట్, తన కొడుకు రోహిత్కు మెదక్ టికెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే.. కేసీఆర్మాత్రం మైనంపల్లి హన్మంతరావుకు మాత్రమే టికెట్ కేటాయించారు. ఇదే క్రమంలో తిరుపతిలో మైనంపల్లి చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.
కాంగ్రెస్లో చేరిక?
మైనపంల్లి హన్మంతరావు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయన.. ఢిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాలు విని పిస్తున్నాయి.