- బాధితులకు 1,039 ఫోన్లు అప్పగించిన మల్కాజిగిరి పోలీసులు
మల్కాజిగిరి, వెలుగు: ఇటీవల మల్కాజిరిగి, ఎల్బీనగర్ప్రాంతాల్లో చోరీకి గురైన, పలువురు పోగొట్టుకున్న 1,039 ఫోన్లను రికవరీ చేసినట్లు డీసీపీ గుణశేఖర్తెలిపారు. గురువారం మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఫోన్ల విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని చెప్పారు.
అనంతరం 30 మంది బాధితులకు ఫోన్లు అప్పగించారు. మిగతా వారికి సమాచారం ఇచ్చామన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 4,733 ఫోన్లు రికవరీ చేశామని పేర్కొన్నారు. డీసీపీ రామేశ్వర్, అడిషనల్డీసీపీ కరుణాసాగర్ తెలిపారు.
