ప్రజలకు సేవ చేయడానికి వచ్చా.. దోచుకోవడానికి కాదు: మంత్రి మల్లారెడ్డి

ప్రజలకు సేవ చేయడానికి వచ్చా..  దోచుకోవడానికి కాదు: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ ప్రజల ఆశీర్వాదంతో  రాష్ట్రంలో తనకే ఎక్కువ మెజారిటీ రావచ్చని మంత్రి మల్లారెడ్డి జోష్యం చెప్పారు. బుధవారం(నవంబర్ 8) మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లారెడ్డికి.. ఆలయ పండితులు ఆశీర్వాదం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమం తర్వాత  కీసర గుట్ట నుండి నేరుగా కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ ఓ రాజేష్ కుమార్ కి నామినేషన్ పాత్రలు అందజేశారు.

అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. "కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు నాకు ఉన్నాయి. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు.. మూడో సారి అధికారంలోకి రావడం ఖాయం. నేను మేడ్చల్ ప్రజలకు ఓ విన్నపం చేస్తున్న.. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను.. అంతేకాని, దోసుకోవడానికి రాలేదు. నాకన్నా మంచి నాయకుడు వస్తే.. వాళ్ళకే ఓటు వేసుకోమని  ప్రజలకు చెబుతున్న" అనిపేర్కొన్నారు.