మమాఎర్త్‌‌‌‌ లాభం రూ.30 కోట్లు.. క్యూ2 లో రెవెన్యూ రూ.496 కోట్లు

మమాఎర్త్‌‌‌‌ లాభం రూ.30 కోట్లు.. క్యూ2 లో రెవెన్యూ రూ.496 కోట్లు

న్యూఢిల్లీ: స్కిన్‌‌‌‌ కేర్ ప్రొడక్ట్‌‌‌‌లు అమ్మే మమా ఎర్త్‌‌‌‌  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ2) ‌‌‌‌లో రూ.30 కోట్ల నికర లాభం పొందింది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్ డబుల్ అయ్యింది. అలానే రెవెన్యూ 21 శాతం పెరిగి రూ.496 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రెవెన్యూ 33 శాతం పెరిగిందని  (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌‌‌‌‌) కంపెనీ  ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. ఇదే టైమ్‌‌‌‌లో ఎఫ్‌‌‌‌ఎంసీజీ సెక్టార్ కేవలం 9 శాతం మాత్రమే వృద్ధి చెందిందని తెలిపింది.  ‘హొనాస (మమా ఎర్త్ పేరెంట్ కంపెనీ) అంచనాలకు మించిన గ్రోత్ నమోదు  చేసింది. కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో మా రెవెన్యూ గ్రోత్‌‌‌‌ ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీల సగటు గ్రోత్ కంటే3.8 రెట్లు ఎక్కువ ఉంది’ అని హొనాస కన్జూమర్ సీఈఓ వరుణ్ అలఘ్‌‌‌‌ పేర్కొన్నారు. రెవెన్యూ కంటే తమ ప్రాఫిట్స్ వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కంపెనీ నికర లాభం 1,377 శాతం (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌‌‌‌‌) పెరిగి రూ.54 కోట్లకు చేరుకుందని అన్నారు. డాక్టర్ శెత్స్‌‌‌‌ బ్రాండ్ రూ.150  కోట్ల క్లబ్‌‌‌‌లోకి జాయిన్ అయ్యిందని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో యాడ్స్ కోసం రూ.174 కోట్లను కంపెనీ ఖర్చు చేసింది.  ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌‌‌లో రూ.182 కోట్లను వచ్చే నాలుగేళ్లలో యాడ్స్ కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది. హొనాస షేరు ధర  బుధవారం సెషన్‌‌‌‌లో 5 శాతం పడి రూ.349 దగ్గర ముగిసింది.