జీప్ ఇండియా తమ పాపులర్ ఎస్యూవీ మెరిడియన్ బ్రాండ్లో '85వ యానివర్సరీ ఎడిషన్' ను లాంచ్ చేసింది. కంపెనీ తమ 85 ఏళ్ల చరిత్రకు గుర్తుగా దీనిని తీసుకొచ్చింది.
ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 36.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). భారత్లో కేవలం 85 యూనిట్లను మాత్రమే అమ్మనుంది. ఈ ఎస్యూవీలో 18-అంగుళాల గ్లాస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎక్స్క్లూజివ్ 85 వ యానివర్సరీ బ్యాడ్జింగ్, పూర్తి బ్లాక్ క్యాబిన్ ఆకర్షణగా నిలుస్తాయి.
