ఎర్రకోటపై మోదీ ప్రసంగం.. ఆయనకు ఇదే చివరిది కానుంది  : మమతా బెనర్జీ

ఎర్రకోటపై మోదీ ప్రసంగం.. ఆయనకు ఇదే చివరిది కానుంది  : మమతా బెనర్జీ

కోల్‌కతా : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానిగా నరేంద్ర మోదీ చేసే  ప్రసంగం.. అదే ఆయనకు చివరిది కానుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం (ఆగస్టు 14న ) అన్నారు. ప్రతిపక్షాల కూటమి ఇండియా త్వరలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక తాము ఆడుతాం(ఖేలా హోబే) అన్నారు. ఖేలా హోబే అనేది 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నినాదం.

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా విజయం సాధిస్తుందని  మమతా బెనర్జీ చెప్పారు. దేశవ్యాప్తంగానూ ఇండియా కూటమి బీజేపీ పార్టీని ఓడిస్తుందన్నారు. కేంద్రంలో తమకు రాజకీయ స్థానం అవసరం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తాము కోరుకుంటున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు.