
కోల్కతా: ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు పాకిస్తాన్పై మిలిటరీ చర్యను కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ ఆపరేషన్ బెంగాల్ చేపడతామని చెప్పడంపై ఫైర్ అయ్యారు. ఇది బెంగాల్ ప్రజలను, మహిళలను అవమానించడమేనన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉన్నామని, వెంటనే ఎలక్షన్స్ నిర్వహించగలరా? అని సవాల్ చేశారు. బెంగాల్ ప్రజలు తమతోనే ఉన్నారని, టీఎంసీకే వారి మద్దతు ఉందన్నారు. మోదీ టీవీలో లైవ్ చర్చలకు రావాలని, వెంట టెలీ ప్రాంప్టర్నూ తెచ్చుకోవాలన్నారు.