ఇంగ్లీష్లో జేమ్స్ బాండ్, హిందీలో దబంగ్, తమిళంలో సింగం సిరీస్ చూశాం. ఇలా ఒకే క్యారెక్టర్తో రూపొందే ఫ్రాంచైజీలు ఇటీవల బాగా పెరిగాయి. అయితే ముప్ఫై ఏళ్లకు ముందే ఇలాంటి ఓ సిరీస్ స్టార్ట్ చేశారు మమ్ముట్టి. 1988లో ‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’ అనే సినిమాలో మమ్ముట్టి నటించారు. ఇందులో ఆయన పోషించిన సీబీఐ ఆఫీసర్ సేతురామ అయ్యర్ పాత్ర హైలైట్ అయింది. సినిమా కూడా సూపర్ హిట్. దాంతో ఆ మూవీ దర్శకుడు మధు నెక్స్ట్ ఇయర్ దానికి సీక్వెల్గా ‘జాగ్రత్త’ అనే మూవీ తీశారు. అది కూడా హిట్.
ఆ తర్వాత 2004లో ‘సేతురామ అయ్యర్ సీబీఐ’, 2005లో ‘నేరారియన్ సీబీఐ’ తీశారు. గత రెండేళ్లుగా ఐదో పార్ట్ ‘సీబీఐ 5’ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొవిడ్తో ఆలస్యమవుతూ వచ్చి.. ఎట్టకేలకు ఇటీవల సినిమా షూట్ స్టార్ట్ చేశారు. ‘అఫీషియల్ లీక్’ అంటూ తన క్యారెక్టర్కు సంబంధించిన ప్రీ లుక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మమ్ముట్టి. సూపర్ హిట్ ఫ్రాంచైజీ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.