- తమిళనాడు నుంచి కేరళకు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
కోయంబత్తూరు: చొక్కా లోపలు నోట్ల కట్టలు దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని తమిళనాడు, కేరళ బార్డర్లో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. వాలయార్ చెక్పోస్ట్ వద్ద ప్యాసింజర్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. కిందకు దింపి సోదా చేయగా, అతడిచొక్కా లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న ప్యాకెట్లోంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి.
నగదు మొత్తం రూ.14 లక్షలుగా తేలాయి. నిందితుడు వినో అని, తమిళనాడు నుంచి కేరళలోని త్రిసూర్కు డబ్బు తరలిస్తున్నాడని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ క్యాష్ ఎవరిది, ఎందుకు తీసుకెళ్తున్నాడనే విషయాలు మాత్రం చెప్పలేదు. కాగా, కేరళలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ఈ నెల 26 న జరగనుంది. దీంతో పోలీసులు రాష్ట్ర బార్డర్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.