ఈ కాలంలో కూడా చాలా మంది అమ్మాయి పుట్టిందని బాధ పడే వారు ఉన్నారు… గర్భంలోనే చిదిమేసే వారు కూడా ఉన్నారు. వారందరికి కూడా చెంప పెట్టు అన్నట్లుగా మహారాష్ట్రకు చెందిన గిరీష్ పాటిల్ అనే వ్యక్తి తనకు కూతురు పుట్టిందని సంతోషంగా ఆ కూతురును ఏనుగుపై ఊరేగింపుగా తన ఇంటికి తీసుకు వెళ్లాడు.
వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్గావ్ లో అరుదైన ఘటన జరిగింది. గిరీష్ పాటిల్ ఇంట్లో గత 35 సంవత్సరాలుగా ఆడ పిల్ల సంతానం లేదు. ఎన్నో పూజలు చేసిన తర్వాత ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది. ఆ చిన్నారిని తమఇంటికి తీసుకొచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికారు. ఏనుగు అంబారీతో స్వాగతం పలకాలని గిరీష్పాటిల్ నిర్ణయించుకున్నాడు. పాపను అమ్మమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చిన తండ్రి.. ఏనుగు అంబారీతో ఊరేగించాడు.
గుర్తుండిపోయేలా...
ఆడపిల్ల అంటే భారంగా భావించి..పురిటిలోనే చంపేస్తున్న నేటి రోజుల్లో ఓ కుటుంబం వేడుకలు చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. పచ్గావ్కు చెందిన గిరీశ్ పాటిల్, సుధ దంపతులకు ఐదు నెలల కిందట కూమార్తె పుట్టింది. పాపకు ‘ఐరా’ అని పేరు పెట్టుకున్నారు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్య, తన కుమార్తెను గిరీశ్ పాటిల్ తొలిసారిగా శనివారం ( మే27) తన ఇంటికి తీసుకొచ్చారు. గుజరాత్లోని హత్తివరోన్ నుంచి పచ్గావ్కు తీసుకొచ్చి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆమెకు గిరీశ్ ఘనస్వాగతం పలికాడు.
ఐదు నెలల చిన్నారిని ఏనుగుపై ఊరేగింపు
కుమార్తెను ఊరు పొలిమేరల నుంచి ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఇంటికి తీసుకువెళ్లాడు. చాలా ఏళ్ల తరువాత తమ ఇంట కూతురు పుట్టిందని పాటిల్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోన్న గిరీశ్.. బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి ఘనంగా ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇలా భిన్నమైన రీతిలో ఆడపిల్ల పుట్టడాన్ని స్వాగతించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
చాలా గ్రేట్
అయిదు నెలల క్రితం జన్మించిన తన కూతురును ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఏనుగు అంబారీని ఏర్పాటు చేయడం ... ఆమె జీవితంలో మర్చిపోలేని విధంగానే కాకుండా ఆడపిల్ల అంటే చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరికి కూడా షాక్ అన్నట్లుగా గిరీష్ పాటిల్ ఈ ఉత్సవంను నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది గ్రేట్ విషయం కదా…