పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేట్ లోని పొట్టి శ్రీరాములు నగర్లో ఓ వ్యక్తి ఏడో అంతస్తులోని బాల్కనీ నుంచి జారిపడి మృతిచెందాడు. గాంధీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టి శ్రీరాములు నగర్ 2బీహెచ్కే ఫ్లాట్ నంబర్713లో ల్యాగల శ్రీనివాస్(48) కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. అతను రాణిగంజ్లో హమాలీ పని చేస్తుంటాడు.
సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం వంట గది నుంచి బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటికే గిన్నెలు పడిన శబ్ధం రావడంతో భార్య కవిత వెళ్లి చూసేసరికి శ్రీనివాస్ గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయాడు. అతన్ని గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
