యువతిని చంపిన ఉన్మాది.. ఉన్మాదిని చంపిన యువతి..

యువతిని చంపిన ఉన్మాది.. ఉన్మాదిని చంపిన యువతి..

తనను ప్రేమించలేదని యువతి గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చిత్తూరు జిల్లా సాంబయ్యకండిగలో జరిగింది. కాగా.. కొన ఊపిరితో ఉన్న నిందితుడిపై యువతి బంధువులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నిందితుడు కూడా మరణించాడు.
 
సాంబయ్యకండిగలోని హౌసింగ్ కాలనీ‌కి చెందిన వరదయ్య కుమార్తె సుస్మిత గుడిపాల మండలంలోని చీలాపల్లి సీయంసీ ఆసుపత్రిలో స్టాప్ నర్స్‌గా పనిచేస్తుంది. అదే కాలనీకి చెందిన చిన్నా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. చిన్నా కొంతకాలం నుంచి ప్రేమ పేరుతో సుస్మితను వేధించేవాడు. ఈ విషయంపై సుస్మిత గతంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు చిన్నాకు కౌన్సిలింగ్ ఇచ్చి  పంపించారు. అయినా కూడా చిన్నాలో ఎటువంటి మార్పు రాలేదు. 

కాగా.. మూడు రోజుల క్రితం చిన్నా.. సుస్మిత డ్యూటీలో ఉండగా.. హాస్పిటల్ వద్దకు వెళ్లి తనను ప్రేమించాలని గొడవ చేశాడు. దాంతో సుస్మిత గుడిపాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు చిన్నాపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో చిన్నా.. ఇంటి మేడపై నుంచి ఇంట్లోకి దిగి ఒంటరిగా ఉన్న సుస్మితపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి.. కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో సుస్మిత అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చిన్నా కూడా అదే కత్తితో తను గొంతు కోసుకున్నాడు. సుస్మిత వాళ్ళ ఇంటి ముందు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా.. సుస్మిత బంధువులు రాళ్లతో దాడి చేశారు. దాంతో చిన్నా అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.