
హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. వ్యక్తిని చితకబాది చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లాకు చెందిన సాయిలు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. మియాపూర్ లో ఇసుక లారీ అన్ లోడ్ కూలీగా పనిచేస్తున్నాడు. ఉదయం 4:30 గంటల సమయంలో టి స్టాల్ నిర్వహకుడు సతిష్ అలియాస్ శ్రీనివాస్ కు, సాయికి నీళ్ల విషయంలో గొడవ జరిగింది.
సాయిలుపై టి స్టాల్ నిర్వహకుడుతో సహా మరో ఇద్దరు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు అంబులెన్సుకు ఫోన్ చేసి సమిపంలోని ప్రైవేటు హస్పిటల్ కు తరలించారు. సాయిలుకు వైద్య పరిక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని చెప్పారు.