ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

బషీర్‌‌‌‌బాగ్‌‌, వెలుగు : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి  మృతి చెందిన ఘటన సైఫాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. అసెంబ్లీ ఎదురుగా సిగ్నల్ వద్ద  ప్రమాదం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..   సైఫాబాద్ నుంచి నాంపల్లి వైపు వెళ్తుండగా నిజాం క్లబ్  గేటు సమీపంలో ఆర్టీసీ బస్సు వెనక  టైర్ కిందపడి వాహనదారుడు స్పాట్ లో  మృతి చెందారు.  

మృతుడిని రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన శ్రీరాములుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్‌‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.  డ్రైవర్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. 

గుర్తు తెలియని వాహనం ఢీకొని..

జీడిమెట్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జగద్గిరిగుట్టకు చెందిన అర్జున్ (37 ) సుభాష్ నగర్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌‌లో పని చేస్తుంటాడు.  శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో డంపింగ్ యార్డ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.  దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.