
భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు.. ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరాల్లో ఒకటిగా చెప్పవచ్చు. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం అంటే వెంటనే గుర్తొచ్చేది భారీ ట్రాఫిక్ జామ్లు, వర్షాల సమయంలో నీటి ఎద్దడి, అధిక అద్దెలు, అధిక క్యాబ్, ఆటో ఛార్జీలు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ సంఘటన వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి 500 మీటర్ల దూరం వెళ్లడానికి ఆటో ఎక్కాడు. కేవలం అర కిలోమీటరు ప్రయాణానికి ఆ డ్రైవర్ రూ.100 వసూలు చేశారు. అవును, ఇది నిజం.
బెంగళూరు న్యూరల్ గ్యారేజ్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ CEO, సహ వ్యవస్థాపకుడు మందార్ నటేకర్ ఈ ఆటో రైడ్ కు సంబంధించి తన అనుభవాన్ని పంచుకోవడానికి X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్కి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ వీడియో షేర్ చేసిన ఆయన.. ''ఈ ఫొటోలో మీరు బెంగళూరులోనే అత్యంత అలంకారమైన వస్తువును చూస్తారు. అదే గొప్ప ఆటో మీటర్. ఇది చాలా ఖరీదైనది, అది ఎప్పుడూ ఉపయోగించబడదు. నేను 500 మీటర్ల రైడ్ కోసం రూ.100 చెల్లించాను. ఒక్క మాటలో చెప్పాలంటే, ముంబైలో సుమారు 9 కిలోమీటర్లకు మీటర్ ఛార్జీ రూ.100లే అని ఆయన క్యాప్షన్ లో రాసుకువచ్చారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది యూజర్లు పలురకాలుగా స్పందించడం మొదలుపెట్టారు. ఈ పోస్ట్పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, తమ అనుభవాలను పంచుకున్నారు. ''మీరు అదృష్టవంతులు. నేను నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని ATMకి అంటే 400 మీటర్ల రౌండ్ ట్రిప్ (200మీ. వన్ వే) కోసం రూ.150 చెల్లించాను. హైదరాబాద్కు స్వాగతం'' అని ఒకరు కామెంట్ చేయగా.. ''బెంగుళూరులోని నా సహచరులతో అనుభవం తర్వాత నేను ఢిల్లీ ఆటోలపై ఫిర్యాదు చేయడం మానేశాను'' అని మరొకరు రాసుకొచ్చారు.
In this photo you will see the most ornamental thing in Bengaluru. The great Auto Meter. So expensive that it never gets used.
— Mandar Natekar (@mandar2404) July 22, 2023
I just paid 100Rs for a 500 mtrs ride. To give perspective, in Mumbai 100Rs is the meter fare for approx 9 kms. @peakbengaluru pic.twitter.com/7piaKjGhnY