క్రికెట్ ఆడుతుండగా 22ఏళ్ల యువకుడికి గుండెపోటు, మృతి

క్రికెట్ ఆడుతుండగా 22ఏళ్ల యువకుడికి గుండెపోటు, మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని ఓ గ్రామంలో 22 ఏళ్ల యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత అతను మరణించాడని ఒక అధికారి తెలిపారు. జిల్లాలోని బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కట్కూట్ గ్రామంలో డిసెంబర్ 30న సాయంత్రం మ్యాచ్ జరుగుతుండగా ఇందల్ సింగ్ జాదవ్ బంజారా బౌలింగ్ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురయ్యాడు.

బంజారా జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి వచ్చిందని, ఆ తర్వాత అకను చెట్టు కింద కూర్చున్నాడు. టీమ్ గెలిచిన తర్వాత, బంజారా అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లమని ఇతర ఆటగాళ్లను కోరాడు. దీంతో అక్కడి నుండి అతన్ని బద్వా సివిల్ ఆసుపత్రికి పంపారు, కానీ అతను మార్గమధ్యంలోనే మరణించాడని గుర్జార్ జోడించారు. అతను గుండెపోటుతో మరణించాడని, పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత, మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బడ్వా సివిల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ వికాస్ తల్వేర్ తెలిపారు.