పక్కింటి వ్యక్తితో గొడవ.. కూతుర్ని మంటల్లోకి తోసేసిన తండ్రి

పక్కింటి వ్యక్తితో గొడవ.. కూతుర్ని మంటల్లోకి తోసేసిన తండ్రి

బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్​మండలంలో తాగిన మైకంలో ఓ తండ్రి తన కూతుర్ని కాలుతున్న గడ్డివాములోకి తోసేశాడు. స్థానికుల కథనం ప్రకారం..​మండలంలోని బరంగెడ్గికి చెందిన దేశాయ్​పేట్​సాయిలుకు ఇద్దరు బిడ్డలు. వీరిద్దరూ ఆదివారం ఇంటి పక్కనే ఉన్న గొట్టల గంగాధర్​అనే వ్యక్తి గడ్డివాము దగ్గర ఆడుకుంటున్నారు. అదే సమయంలో గడ్డివాముకు నిప్పంటుకొని దగ్ధమైంది. 

సాయిలు కూతురు అంకిత (7)నే గడ్డివాముకు నిప్పంటించిందని గంగాధర్...​సాయిలుతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు అంకిత వల్లే తను మాటలు పడాల్సి వస్తోందనే ఆగ్రహంతో ఆమెను మంటల్లోకి తోసేశాడు. గంగాధర్​ వెంటనే పాపను బయటికి తీసినప్పటికీ ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే 108లో బాన్సువాడ దవాఖానకు తరలించారు. కాగా, దీనిపై  తమకు కంప్లయింట్​అందలేదని పోలీసులు తెలిపారు.