ధార్ (మధ్యప్రదేశ్) : కరోనా సెకండ్ వేవ్ టైంలో ఓ వ్యక్తి వైరస్ బారిన పడి చనిపోయాడు. డెడ్బాడీని అతని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. వారు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ వ్యక్తి మళ్లీ రెండేండ్ల తర్వాత శనివారం పొద్దున ఆరు గంటలకు ఇంటికొచ్చేశాడు. అతన్ని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ షాక్కు గురయ్యారు. ‘‘2021లో కమలేశ్ పాటిదార్ (35) కరోనా బారినపడ్డాడు. హెల్త్ కండీషన్ క్రిటికల్గా ఉండటంతో గుజరాత్ వడోదరలోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కమలేశ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డెడ్బాడీని అప్పగించడంతో అంత్యక్రియలు కూడా పూర్తి చేశాం”అని కమలేశ్ కజిన్ ముఖేశ్ పాటిదార్ తెలిపాడు. దాదాపు రెండేండ్ల తర్వాత శనివారం పొద్దున ఆరు గంటలకు కరోడ్కల గ్రామంలో ఉన్న అతని చిన్నమ్మ ఇంటి తలుపు తట్టాడని వివరించాడు.
కమలేశ్ను చూసి ఇంట్లో ఉన్నవాళ్లందరూ షాక్కు గురయ్యారని తెలిపాడు. రెండేండ్లు ఎక్కడ ఉన్నాడో మాత్రం చెప్పలేదన్నాడు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించినట్లు తెలిపాడు. 2021లో కమలేశ్ చనిపోయాడని చెప్పి డాక్టర్లు డెడ్బాడీని కుటుంబ సభ్యులకు ఇచ్చారని కన్వాన్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్రామ్సింగ్ రాథోడ్ తెలిపాడు. రెండేండ్లు ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కమలేశ్ ఫ్యామిలీ మెంబర్స్ అంత్యక్రియలు నిర్వహించిన డెడ్బాడీ ఎవరిదనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నామని వివరించారు.