
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో పర్సనల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ మేనేజ్మెంట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీఎం జి.రాజేంద్ర ప్రసాద్ను కొత్తగూడెం కార్పొరేట్ కు, డీజీఎం జి.వెంకటమోహన్రావును కొత్తగూడెం ఏరియాకు, డీజీఎం కేసా నారాయణరావును కార్పొరేట్ వెల్ఫేర్వింగ్కు, డీజీఎం అజ్మీరా తుకారాంను ఇల్లందుకు, డీజీఎం బి.శివ కేశవరావును సీపీఆర్ఎంఎస్ వింగ్కు, డీజీఎం డి.కిరణ్బాబును జైపూర్ ఎస్టీపీపీకి, పర్సనల్మేనేజర్ వై.ప్రభాకర్రావును విజయవాడ అప్మెల్సంస్థకు, పీఎం రెడ్డిమల్ల తిరుపతిని గోదావరిఖని సూపర్బజార్డీఎంగా, డిప్యూటీ పీఎం ఎస్వీ రాజేశ్వరరావును కార్పొరేట్ఎడ్యుకేషన్ వింగ్కు, డిప్యూటీ పీఎం పీబీ అవినాష్ను కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్కు, డీవైపీఎం గుర్రం శ్రీహరిని కార్పొరేట్వెల్ఫేర్వింగ్కు, డివైపీఎం కె.మైత్రేయబందును కార్పొరేట్హెచ్ఆర్డీకి, డీవైపీఎం జేఏ నరేన్చక్రవర్తిని కార్పొరేట్ ఐఆర్వింగ్కు, డీవైపీఎం నాగుల వేణును ఆర్జీ–1 ఏరియాకు, డీవైపీఎం ఎ.సత్యబోస్ను కార్పొరేట్ఈఈ సెల్కు బదిలీ అయ్యారు. ఇంకా సీనియర్పీవోలు, వెల్ఫేర్ ఆఫీసర్లు కలిపి మొత్తం 39 మందిని ట్రాన్స్ ఫర్ చేసింది.